LATEST UPDATES

AP LATEST UPDATES

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

దివ్య౦గుల పూర్తి సమచార౦

SSA సమగ్ర శిక్ష అభియాన్‌లో ఉద్యోగాలు...నేటి నుంచి దరఖాస్తులు

Posted by PAATASHAALANEWS on Thursday, 21 November 2019


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

SSA సమగ్ర శిక్ష అభియాన్‌లో ఉద్యోగాలు...నేటి నుంచి దరఖాస్తులు

తెలంగాణలో పాఠశాల విద్యకు సంబంధించి 'సమగ్ర శిక్ష అభియాన్‌'లో తాత్కాలిక, కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే.

దీనిద్వారా వివిధ విభాగాల్లోని మొత్తం 704 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

వీటిలో మేనేజ్‌మెంట్ ఇన్ఫ్‌ర్మేషన్ సిస్టం (MIS) ఎంఆర్పీ విభాగంలో కో-ఆర్డినేటర్ పోస్టులు; డీఈవో, డీపీవో కార్యాలయాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు, సిస్టం అనలిస్ట్ పోస్టులు, అసిస్టెంట్ ప్రోగ్రామర్ పోస్టులు ఉన్నాయి.

మొదట ప్రకటించిన షెడ్యూలు ప్రకారం నవంబరు 18 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా.. నవంబరు 20కి వాయిదా వేశారు.

అభ్యర్థులు నవంబరు 20 నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు చివరితేది ఇంకా ప్రకటించాల్సి ఉంది.

కొత్త జిల్లాల వారీగానే నియామకాలు చేపట్టనున్నారు.

*పోస్టుల వివరాలు.*

మొత్తం ఖాళీలు: 704

☯️ఎంఐఎస్ కోఆర్డినేటర్‌ - 144

అర్హత: బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్), పీజీడీసీఏ (లేదా) బీఎస్సీ(ఎంపీసీ), పీజీడీసీఏ (లేదా) బీసీఏ, ఎంఎస్ ఆఫీస్ తెలిసి ఉండాలి.

☢️సిస్టమ్ అనలిస్ట్‌ - 12

అర్హత: బీకామ్/ఎంకామ్ (అకౌంటింగ్ ప్యాకేజీ)

🌐అసిస్టెంట్ ప్రోగ్రామర్‌ - 27

అర్హత: ఎంసీఏ/ బీటెక్ (కంప్యూటర్ సైన్స్), ఎంఎస్సీ (కంప్యూటర్ సైన్స్) ఉండాలి. ఒరాకిల్ నాలెడ్జ్ ఉండాలి.

🟣డేటా ఎంట్రీ ఆపరేటర్‌ - 138

అర్హత: ఏదైనా డిగ్రీతోపాటు డీసీఏ, ఎంఎస్ ఆఫీస్

🔵ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్‌ - 383

అర్హత: ఇంటర్‌తో పాటు డిప్లొమా(స్పెషల్ ఎడ్యుకేషన్) లేదా డిగ్రీతో పాటు బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) ఉండాలి.

వయసు: 01.07.2019 నాటికి 34 సంవత్సరాలకు మించకూడదు.

🔴దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్ష ద్వారా.
దరఖాస్తు ఫీజు: రూ.600.
రాతపరీక్ష విధానం.
మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు విభాగాలు (పార్ట్-1, పార్ట్-2) ఉంటాయి. ఒక్కో విభాగానికి 50
మార్కులు కేటాయించారు.
ఇంగ్లిష్‌లోనే ప్రశ్నపత్రం ఉంటుంది.
పరీక్ష సమయం 150 నిమిషాలు (2 గం. 30 నిమిషాలు).

ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్లకు మాత్రం 80 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 160 ప్రశ్నలు అడుగుతారు.

ముఖ్యమైన తేదీలు.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 20.11.2019.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: ప్రకటించాల్సి ఉంది..
రాతపరీక్ష: డిసెంబరు 2వ వారంలో

Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: November 21, 2019

0 comments:

Post a Comment